పాడేరులో ‘జైల్‌ భరో’.. నాయకుల అరెస్టులు..

ప్రజాశక్తి-పాడేరు(అల్లూరి) : అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనల్లో భాగంగా పాడేరు ఐటిడిఎ వద్ద అంగన్‌వాడీలు, మున్సిపల్‌, సమగ్రశిక్షా ఉద్యోగులకు మద్దతుగా.. మంగళవారం అన్ని కార్మిక సంఘాలు జైల్‌భరోకు పిలుపునిచ్చాయి. వైస్‌ జగన్‌ ప్రభుత్వం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో పాడేరు రోడ్డు రవాణా స్థంభించింది. ఈ నేపథ్యంలో.. పాడేరు ఐటీడిఎ వద్ద ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమా మహేశ్వరరావు, సీఐటీయూ నాయకులు సుందర్‌ రావు, అంగన్వాడీ నాయకులు కె.భాగ్యలక్ష్మి, గిరిజన సంఘం నాయకులు బొజ్జన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు చిన్నారావు అంగన్వాడీ, ఆశా, విఎఓ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు.

➡️