విశాఖ : విశాఖలోని టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై … జనసేన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నోవాటెల్ హౌటల్ వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ … శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా ? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లాల్సి వస్తుందని అన్నారు. విశాఖ ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ సేల్స్ పెంచుకోవడం కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారని ఆరోపించారు. వాస్తు దోషం తొలగించుకోవడానికి రోడ్లు మూసివేయడం అన్యాయమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలని కోరారు. డివైడర్ తొలిగించే వరకు జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలు మాత్రమే గడువు మిగిలి ఉంది అని చెప్పారు. నిరసన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు నాదెండ్ల మనోహర్ను అరెస్టు చేశారు.