ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు గురువారంనాడు తన ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, ఇతర వామపక్ష ప్రజాతంత్ర నాయకులు ఈ ప్రచారంలో పాల్గన్నారు. ఉదయం ఏడు గంటలకు ఉండవల్లి గ్రామంలోని పుచ్చలపల్లి సుందరయ్య చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉండవల్లి సెంటరు సెంటరు నుంచి తిరిగి ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుంది. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలపరుస్తున్న మంగళగిరి అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగా అజరుకుమార్లను గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు.