హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. రెండు నెలల పాటు గడువును పెంచుతూ ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు. రేపటితో గడువు ముగియడంతో ఆగస్టు 31వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ గడువును పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/kaleswaram.jpg)