డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉద్యోగులు సంబరాలు

Dec 6,2023 14:55 #Congress, #Kodandaram, #Telangana
kodanda ram comments at ts sachivalayam

ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో డా.బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని పటాసులు కాల్చారు. సచివాలయం గేటు ముందు నిర్వహించిన సంబరాల్లో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, ఉద్యోగ సంఘ నేతలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండ రామ్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిగా ఉంటాననీ అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి ఉద్యోగులు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు.

➡️