హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ ఎం. వేణుగోపాలరావు తెలంగాణ స్టేట్ ఆడిట్ అడ్వైజరీ బోర్డ్ (ఎస్ఎఎబి) సభ్యులుగా నియమితులయ్యారు. 2024-26 రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈమేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెలంగాణ ఐఎఎస్ అధికారి పి. మాధవి గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే రెండో వారంలో జరగనున్న ఎస్ఎఎబి సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ అయిన ఎం.వేణుగోపాలరావు ప్రజాశక్తిలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఎస్ఎఎబి సభ్యులుగా నియమితులైన వేణుగోపాలరావుకి ప్రజాశక్తి ఎడిటర్ బి.తులసీదాస్, సిజిఎం వై.అచ్యుత్రావు అభినందనలు తెలిపారు.