పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్గా ఇల్లకియా
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఎఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరు లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనరుగా బదిలీ అయ్యారు. నంద్యాల కలెక్టరు మంజీర్ జిలానీ సామూన్ను శ్రీకాకుళం కలెక్టరుగా, తిరుపతి కలెక్టరు కె వెంకటరమణారెడ్డిని హౌసింగ్ ఎమ్డిగా, ఆ పోస్టులో పనిచేస్తున్న జి లక్ష్మీశాను తిరుపతి కలెక్టరుగా, నంద్యాల కలెక్టరుగా అభిశక్త్ కిశోర్ను నియమించారు. అక్కడ ఎఫ్ఎసిగా ఉన్న ఫార్మన్ అహ్మద్ఖాన్ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టరు బిఆర్ అంబేద్కర్ను పార్వతీపురం మన్యం జాయింట్ కలెక్టరుగా, నెల్లూరు జాయింట్ కలెక్టరు రోణంకి కూర్మనాథ్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరుగా, విశాఖపట్నం జాయింట్ కలెక్టరు కెఎస్ విశ్వనాథన్ను గ్రేటర్ విశాఖ అడిషనల్ కమిషనరుగా బదిలీ చేశారు. విజయనగరం జాయింట్ కలెక్టరు కతవాటే మయూర్ అశోక్ను విశాఖ జాయింట్ కలెక్టరుగా, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రెవెన్యూ అడిషనల్ డైరెక్టరు గోపాలకృష్ణ రోణంకిని ప్రకాశం జాయింట్ కలెక్టరుగా నియమించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్యను కాకినాడ జాయింట్ కలెక్టరుగా బదిలీ చేశారు. కాకినాడలో జాయింట్ కలెక్టరుగా పనిచేస్తున్న ఇల్లక్కియాను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్గా బదిలీ చేశారు. ఆర్ గోవిందరావును సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డైరెక్టరుగా, అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టరు కొల్లాబత్తుల కార్తీక్ను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టరుగా, గ్రామ, వార్డు సచివాలయ అడిషనల్ డైరెక్టరు భావనను అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టరుగా, తిరుపతి మున్సిపల్ కమిషనరు డి హరితను మున్సిపల్శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్డిగా, నూజివీడు సబ్ కలెక్టరు ఆదర్శ రాజేంద్రన్ను నెల్లూరు జాయింట్ కలెక్టరుగా నియమించారు. విజయవాడ సబ్ కలెక్టరు అదితిసింగ్ను తిరుపతి మున్సిపల్ కమిషనరుగా, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రేఖారాణిని పబ్లిక్ ఎంటర్ప్రైజస్ డిపార్టుమెంట్ సెక్రటరీగా బదిలీ చేశారు.