బకాయిలకై మిమ్స్ ఉద్యోగుల ఆందోళన

Feb 5,2024 16:39 #hospital, #Protest, #Vizianagaram
mims hospital staff protest

బకాయి డీఏలు చెల్లించాలి
సస్పెండ్ చేసిన ఉదోగ్యులను విధుల్లోకి తీసుకోవాలి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని డిమాండ్
నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా 
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నెల్లిమర్ల మిమ్స్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయాలని, బకాయి ఉన్న ఏడు నెలలు డిఎ బకాయిలు చెల్లించాలని, సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మిమ్స్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధ్వర్యంలో సోమవారం నగరంలో మూడు లాంతర్లు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ యాజమాన్యం ఉద్యోగులకు సంఘం లేకుండా చేసి గత మూడు ఏళ్లుగా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా నిరంకుశంగా చూసిందన్నారు. ఉద్యోగులలో వెట్టి చాకిరి చేయించుకొని శ్రమ దోచుకున్నారని అన్నారు. ఏడు డి.ఏ లు ఇవ్వకుండా ఉద్యోగులను అన్యాయం చేసిందన్నారు. అడిగిన ఉద్యోగులను సస్పెండ్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు యాజమాన్యం పాల్పడుతుందని అన్నారు. గత ఐదు రోజులుగా మిమ్స్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని మిమ్స్ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. ఈసమస్యలను పరిష్కారం చేయమని అడుగుదామంటే మిమ్స్ లో వినేనాధుడే కనిపించడం లేదన్నారు. ఒక వేళ ఎవరైనా అడిగితే బెదిరింపులు, కక్ష సాధింపులు చేస్తూ ఏవిదమైన ముందస్తు నోటీసులు లేకుండా నేరుగా సస్పెండ్లు లేదా బదిలీలు చేస్తున్నారన్నారు. 31.01.2024న నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడినందుకు గత గురువారం(01.02.2024)న ఎప్పుటి లాగే విధులకు హాజరు అవుతున్న సమయంలో గేటు దగ్గర ఇద్దరు ఉద్యోగులను ఆపేసారన్నారు. యాజమాన్యం చేపడుతున్న ఈ చర్యలపై ఆందోళన చెందిన ఉద్యోగులు తొటి ఉద్యోగలను అన్యాయంగా ఆపివేయడంతో ఆక్షణం నుండి విధులను బహిష్కరించారన్నారు. సంస్థ చైర్మన్ అయిన మీరు వెంటనే కలుగ జేసుకొని ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ క్రింది సమస్యలపై మా యూనియన్తో చర్చించి పరిషష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. 2011 నుండి 2020 ఏప్రిల్ వరకు ప్రభుత్వం ప్రకటించిన డిఎ ను ఉద్యోగులందరికీ చట్టప్రకారం చెల్లించారు. కానీ 2020 అక్టోబరు నుండి నేటి వరకు డిఏలను ఏ ఒక్కరికి చెల్లించలేదన్నారు. బకాయి ఉన్న 7 డి. ఏలను ఎరియర్స్తో పాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017 వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం చేసుకున్నాం. (2011-2013-2015-2017) 2019లో జరగాల్సిన వేతన ఒప్పందం నేటికి జరగలేదు, వెంటనే వేతన ఒప్పందం చేయాలన్నారు. కక్షసాదింపుల్లో బాగంగా కొంత మంది ఉద్యోగులను బదిలీచేసారు. వీరికి మిమ్స్ లోనే డ్యూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  2సం||రాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. 2019 లో వేతన ఒప్పందానికై ఉద్యోగులు పోరాడిన సందర్భంగా కొంతమంది ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్పెండ్ చేసిన ఇద్దరిని స్పెన్షన్ ఉపసంహరించుకొని బేషరుతుగా విదుల్లోకి తీసుకోవాలన్నారు. డ్యూటీలో భాగంగా జరిగిన చిన్నచిన్న పొరపాట్లకు ఉద్యోగుల నుండి డబ్బులు రికవరీ చేసారు. హాస్పిటల్ రికరీ చేసిన దబ్బులను తిరిగి ఆ ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై కక్షసాధింపులు, బెదిరింపులు ఆపాలన్నారు. వెంటనే కలెక్టర్, కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్, కార్మిక శాఖ అధికారికి వినతి పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, టివి రమణ, ఎం.నారాయణరావు, కె.రామారావు, మిమ్స్  ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️