- ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నివాళి
ప్రజాశక్తి-ఉరవకొండ టౌన్ : అనంతపురం జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ (85) బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఆమె మరణించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. లలితమ్మ మృతి విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి…కొనకొండ్ల గ్రామానికి చేరుకుని లలితమ్మ భౌతికకాయాన్నికి నివాళులర్పించారు. ఆమెకు ఐదుగురు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్సీగా శివరామిరెడ్డి, సాయిప్రసాద్రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ఆదోని, మంత్రాలయం, గుంతకల్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరో కుమారుడు సీతారామిరెడ్డి టిటిడి బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉష శ్రీచరణ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, శంకరనారాయణ, జడ్పి ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు లలితమ్మకు నివాళులర్పించారు.