-గ్రామ, వార్డు సచివాలయశాఖ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ (ఎఫ్ఒఎ)తో గ్రామ, వార్డు సచివాలయశాఖ కుదుర్చుకున్న ఒప్పందం గడువు ఫిబ్రవరి 29తో ముగిసిందని, మార్చి ఒకటి నుంచి ఎఫ్ఒఎతో కానీ, మండల లెవెల్ ఆఫీసరు (ఎమ్ఎల్ఒ)తో కానీ తమ శాఖకు ఎటువంటి సంబంధం లేదని గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టరు శివప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.