అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదు : టీటీడీ డీఎఫ్‌వో

Dec 30,2023 12:16 #Tirumala walkway, #ttd

ప్రజాశక్తి -తిరుమల : అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదని టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసు తెలిపారు. తిరుమలలో చిరుత, ఏలుగుబంటి సంచరిస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన శనివారం స్పందించారు. ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. శేషాచల అటవీ ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలిపారు. ట్రాప్‌ కెమెరాలలో చిరుత కదలికలు రికార్డయ్యాయని, గడిచిన 29 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచరించిందన్నారు. అదే ప్రాంతంలో ఒక ఏలుగుబంటి కూడా కనిపించిందని తెలిపారు. అయితే, మెట్ల మార్గం చుట్టుపక్కల ఎలాంటి జంతు సంచారం లేదన్నారు. యాత్రికుల భద్రత దృష్ట్యా .. అలిపిరి కాలిబాట మార్గంలోని 7వ మైల్‌ నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ఫారెస్ట్‌ సిబ్బందితో ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. యాత్రికులు నిర్భయంగా తిరుమల రావొచ్చని తెలిపారు.

➡️