సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో జిల్లా పోలీస్‌ అబ్జర్వర్‌ పరిశీలన

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా పోలీస్‌ అబ్జర్వర్‌ కెప్టెన్‌ ఎంకే.అయ్యప్ప ఆదివారం పరిశీలించారు. మండల పరిధిలోని పందిళ్ళపల్లి రామన్నపేట గ్రామాల్లో ఉన్న 8 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు ఎలాంటి చర్యలు ముందస్తుగా చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌ ప్రతి గదిని పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ సందర్శించి, రికార్డులను పరిశీలించి సంతఅప్తి వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు స్థానిక మీడియా అబ్జర్వర్‌ తో మాట్లాడడానికి వేచి ఉన్నప్పటికీ మీడియాతో మాట్లాడేది లేదంటూ తన వాహనంలో వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పి బేతపూడి ప్రసాద్‌ , రూరల్‌ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ, వేటపాలెం ఎస్సై జి.సురేష్‌ ఉన్నారు.

➡️