27న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ రాష్ట్ర పర్యటన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక రోజు పర్యటనకు ఈనెల 27న రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్టణం, విజయవాడ, ఏలూరుల్లోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించనున్న స్టేట్‌ పార్లమెంటరీ బిజెపి కోర్‌ కమిటీ సమావేశంలోనూ, ఆ తరువాత ఏలూరులో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. తిరిగి, . సాయంత్రం 7.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు: పురందేశ్వరి ఫ్యాన్‌ గుర్తుపై ఓటేశాలా వలంటీర్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగసభలో చెప్పడం ఇసి నిబంధనలు ఉల్లంఘించడమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఎన్నికల నిర్వహణపై కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా ఉండాలని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు కూడా ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్దమన్నారు. వీరి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి తాను లేఖ రాసినట్లు పురందేశ్వరి తెలిపారు.

➡️