హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కఅషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.”గురువారం నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో ఐదు పథకాలకు (మహాలక్ష్మి, రైతుభరోసా, గఅహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తాం. ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జనవరి 7లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నాం. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తుంది. ప్రతి మండలానికి తహశీల్దార్ బాధ్యత వహిస్తారు. ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.ఐటీఐఆర్ కారిడార్ వెనక్కి పోతే కేంద్రాన్ని నిలదీయలేదు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. టీఎస్పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. గవర్నర్ నిర్ణయం తీసుకున్నాక కొత్త బోర్డు ఏర్పాటు చేస్తాం. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను నియమిస్తాం. అనంతరం ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. గ్రూప్- 2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయిస్తాం. రైతుబంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత ఎల్ అండ్ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తెలుస్తుంది. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. 6.71లక్షల కోట్లు అప్పులు చేసి నిండా ముంచారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కఅషి చేస్తున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.