తిరుపతి : తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సంఖ్య మంగళవారానికి కొంత తగ్గుముఖంపట్టింది. సోమవారంనాడు స్వామివారిని 62,894 మంది దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 22,894 మందిగా ఉంది. సోమవారంనాడు హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చింది. ఉచిత సర్వ దర్శనానికి రెండు కంపార్ట్మెంట్లలో యాత్రికులు వేచివున్నారు. ఉచిత సర్వదర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి ఒక కంపార్ట్మెంట్లో యాత్రికులు వేచివున్నారు. సుమారు మూడు గంటలవరకూ దర్శనానికి సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు పడుతోంది.