ప్రజాశక్తి-అమరావతి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను వెబ్సైట్లో నమోదు చేసుకుని మార్కుల జాబితా పొందొచ్చు. కాగా ఈనెల 12వ తేదీన విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 67 శాతం, ఇంటర్ ద్వితీయ సంత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది.