ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్ర పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీకి వెళ్లారు. బుధవారం పార్టీ హైకమాండ్ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి పార్లమెంట్కు వెళ్లారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్కు లేఖ అందజేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన పలువురు ఎంపీలతో రేవంత్.. రూం నెబర్ 66లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/mp-1.jpg)