ఆమంచికి బీఫారం అందజేసిన షర్మిల

ప్రజాశక్తి- చీరాల : ఏపీసిసి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిలా రెడ్డి చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కు మంగళవారం స్వయంగా బీఫారం అందజేశారు. ఆమంచి విజయం సాధించి అసెంబ్లీకి రావాలని ఆమె ఆకాంక్షించారు. తన రోడ్‌ షోలో, బహిరంగ సభలో పాల్గొనేందుకు చీరాలకు వచ్చిన షర్మిలకి ఆమంచి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పందిళ్ళపల్లి నుంచి నుంచి చీరాల వరకు షర్మిల, ఆమంచి కృష్ణమోహన్‌ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఆమంచికి కాంగ్రెస్‌ కండువా కప్పారు. అనంతరం గడియారం స్తంభం సెంటర్లో బహిరంగ సభలో మాట్లాడకుండానే షర్మిల బాపట్ల వెళ్లిపొయారు. అనంతరం ఆమంచి అనుచరులు, కాంగ్రెస్‌ శ్రేణులు.. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆర్వో వద్దకు ర్యాలీగా వెళ్లారు.

➡️