మద్య నిషేధం హామీ ఎక్కడ ? : షర్మిల లేఖ

అమరావతి: ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖ రాశారు. ”మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడీ పాక్షికంగానైనా అమలవుతోందా? మూడు దశల్లో అమలు చేస్తామన్నారు. నిషేధం తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారు. మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని రూ.30 వేల కోట్లకు పెంచుకున్నారు. గతంలో మద్యంపై ఆదాయం.. ప్రజల రక్తమాంసాలపై వ్యాపారమన్నారు.. మరి మీరేం చేశారు? కనీవినీ ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.11 వేల కోట్లు రుణాలెందుకు? డ్రగ్స్‌ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఎందుకుంది? 20.19 లక్షల మంది డ్రగ్స్‌కు అలవాలటుపడటం మీ వైఫల్యం కాదా?” అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.

➡️