కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు

May 23,2024 11:24 #AP, #police, #sit

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఎన్నికల ఘర్షణలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్‌ మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్‌ బందాలు వెళ్లనున్నాయి. జిల్లాల్లో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్‌ మరో నివేదిక ఇవ్వనుంది. ఏపీలో కౌంటింగ్‌ సమయం దగ్గరపడటంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. పోలింగ్‌ తర్వాత అల్లర్లలో పాల్గొన్నవారిపై సిట్‌ ఫోకస్‌ పెట్టింది.

➡️