వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఎస్పి, డిఎస్పి
ప్రజాశక్తి- మంగళం (తిరుపతి) :తిరుపతి మంగళం పరిధి తిమ్మినాయుడుపాలెం సమీపంలో ఆరు ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తున్న దోస్త్ లగేజీ వాహనం, మోటారు సైకిల్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్ను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పి పి శ్రీనివాస్, డిఎస్పి చెంచుబాబు తెలిపిన వివరాల మేరకు.. ఆర్ఐ (రిజర్వు) సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ సురేష్ బాబు బృందం బుధవారం మంగళం భూపాల్ కాలనీల మీదుగా తిమ్మినాయుడు పాలెం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. గురువారం బయోట్రిమ్ వద్ద లగేజీ వాహనంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారు. వాహనాన్ని పోలీసులు చుట్టుముట్టగా అక్కడున్న వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడు చిత్తూరు రూరల్ తుమ్మందపాలెంకు చెందిన పవన్ (23)గా గుర్తించారు. ఈ దుంగలను తమిళనాడులోని తిరుత్తని మీదుగా కర్ణాటకలోని హోస్పేటకు తరలిస్తున్నామని నిందితుడు తెలిపాడు. దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని సిఐ శ్రీనివాసులు తెలిపారు.