న్యాయం కోసమే పోరాటం: సునీత

Apr 18,2024 14:15 #speech, #ys sunitha

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. న్యాయం కోసం తాము పోరాడుతున్నామని.. షర్మిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
”ప్రజలను కదిలిస్తే ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఎక్కువగా ఉంది. పులివెందుల ప్రజలతో పాటు నేనూ బాధపడుతున్నా. ఈ బాధను మే 13 జరిగే ఎన్నికలలో ఓట్ల రూపంలో చూపించాల్సిన అవసరముంది. వివేకానందరెడ్డిని దారుణంగా చంపించిన వారిని ఓడించాలి. ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు. వీటిన్నింటికీ ప్రజలే ఓట్ల ద్వారా తీర్పు చెప్పాలి” అని సునీత కోరారు.

➡️