లారీని డీ కొట్టిన కారు- ముగ్గురి మృతి – మరో ఇద్దరి పరిస్థితి విషమం

Apr 24,2024 22:40 #kavali, #road accident

ప్రజాశక్తి-కావలి రూరల్‌ :నెల్లూరులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి మరో లారీని కారు ఢకొీన్నది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి రూరల్‌ మండలం ముసునూరు టోల్‌ప్లాజా వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కొయ్యల గూడెం అశోక్‌ నగర్‌కు చెందిన ఐదుగురు తమ సొంత పనుల నిమిత్తం చెన్నరుకి కారులో వెళ్లారు. తిరిగి నెల్లూరు మీదుగా కొయ్యలగూడెంకు వస్తుండగా కావలి రూరల్‌ మండలం, ముసునూరు టోల్‌ ప్లాజా వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేసి మరో లారీని వేగంగా ఢకొీట్టారు. ఈ ప్రమాదంలో కల్యాణి(21) సిరి (30) కుమార్‌ (53) అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్‌ ఎస్‌కె జాలానీ, కుమారి తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️