కన్నకూతురిని గొంతు కోసి చంపిన తండ్రి

Mar 13,2024 18:49 #death, #Hatya, #Kurnool

ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు) : కన్న కూతురినే తండ్రి గొంతు కోసి చంపిన ఘటన బుధవారం కోసిగి మండలంలోని జంపాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనపై బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కోసిగి మండల పరిధిలోని జంపాపురం గ్రామానికి చెందిన ఖగ్గల్‌ శాంతకుమార్‌, ఆశీర్వాదమ్మలు మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. అయితే పెళ్లయిన నాటి నుంచి భార్య భర్తలు తరుచూ గొడవలు జరుగుతునే ఉండేవని తెలిపారు. మంగళవారం శాంతికుమార్‌ ఆశీర్వాదమ్మతో గొడవపడి తన కూతురిని పక్కనే ఉన్న గుడిసెలోకి లాక్కొని వెళ్లి గొంతు కోసి గుడిసె బయట వేలాడదీశాడని పేర్కొన్నారు. దీంతో శాంతికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బందువులను నమ్మించేందుకు ప్రయత్నం చేశాడని.. కన్న కూతురిని ఏ తండ్రియైన చంపుకుంటాడా అని..పందులు తన కూతురిని చంపినట్లు శాంతికూమర్‌ మాయమాటలు చెబుతున్నాడని ఆశీర్వాదమ్మ కన్నీటి పర్యంతమైంది. ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న కూతురుని.. కళ్ళ ముందు తిరిగే చిన్నారిని చంపడానికి మనసెలా వచ్చిందో అని ఆ కాలనీవాసులు ఆ కసాయి తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనను చూడడానికి తండోపతండాలుగా ఆ ఊరి గ్రామస్తులు తరలివచ్చారు. గొంతు తెగపడి ఉన్న ఆ చిన్నారిని చూసిన చూపరులు కన్నీటి పర్యంతమైయ్యారు. ఈ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కోసిగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️