నిందితుడిని గుర్తించాం! గాలింపు చర్యలు చేపట్టాం: రవి శంకర్

Feb 3,2024 14:46 #AP police, #Hatya, #visakhapatnam

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితులను గుర్తించడం జరిగిందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ తెలిపారు శనివారం మధ్యాహ్నం నగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో అగంతకుడు.. రాడ్డు తో రమణయ్య తో దాడి చేశారు. డయల్ 112 కి కాల్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళాడం జరిగిందని తెలిపారు.హత్య చేసిన వ్యక్తి ఫ్లైట్ ఎక్కి వెళ్లినట్టు గుర్తించామాని ఈ కేసులో 10 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.అగంతకుడు చాలా సార్లు రమణయ్య ఆఫీస్ లోకి వెళ్లి వచ్చినట్టు గుర్తించామని త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. కేసు విచారణలో ఉన్నందున మరిన్ని వివరాలు నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం వెల్లడిస్తామని అయన అన్నారు.

➡️