ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భారత భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు రెండో రోజు గురువారం ఉత్సాహంగా సాగుతున్నాయి. తొలిరోజు జరిగిన గ్రూపు చర్చల్లో వివిధ జిల్లాల ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు విప్లవ గీతాలను ఆలపించారు. ‘విద్యార్థి ఉద్యమ పోరు కెరటాలు వీరులూ మా సురులోయమ్మా..చదువుతూ పోరాడి నేలకొరిగారు…ఆ ఆశయాల కోసం ఊపిరివదిలారు’ అంటూ గీతాలు ఆలపించారు.