ప్రజాశక్తి – ఆనందపురం (విశాఖపట్నం) : రూ.50 లక్షల దొంగనోట్లు, గోల్డ్ కాయిన్స్ను విశాఖలోని భీమిలి క్రాస్రోడ్ చెక్పోస్టు వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఫేక్ కరెన్సీ రవాణా జరుగుతుందని అందిన సమాచారం మేరకు ఆనందపురం సిఐ టివి.తిరుపతిరావు పోలీసు సిబ్బందితో కలిసి భీమిలి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. తగరపువలస నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న కారు డ్రైవరు పోలీసులను చూపి కారును వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కారులోని ఫేక్ కరెన్సీ, ఫేక్ గోల్డ్ కాయిన్స్, రెండు కత్తులు, ఒక రాడ్డును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డ వారిలో హేమచంద్రరావు, సునీల్, హరి శ్రీను, హేమంత్ కుమార్, ఎం.సుబ్బారెడ్డి, ధనాల శ్రీనివాస్ ఉన్నారు.