ప్రజాశక్తి-తిరుమల: తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒక్కసారిగా గుంపు రోడ్లమీదకు వచ్చాయి. పార్వేట మండపం ప్రాంతంలో నిన్న రాత్రి చెట్లను ఏనుగులు నేల కూల్చాయి. ఏనుగుల సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు.