లడ్డు నాణ్యత లేదు..

Jan 6,2024 10:37 #tirumala tirupathi temple, #ttd
  • డయల్‌ యువర్‌ ఇఒలో ఫిర్యాదుల వెల్లువ

ప్రజాశక్తి – తిరుమల : లడ్డూలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని, రుచి తగ్గిందని ‘డయల్‌ యువర్‌ ఇఒ’ కార్యక్రమంలో ఓ సందర్శకుడు ఫిర్యాదు చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఇఒ కార్యక్రమంలో పలువురు సందర్శకులు అడిగిన ప్రశ్నలకు టిడిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి సమాధానాలిచ్చారు. ఫిర్యాదుల్లో సందర్శకులు మాట్లాడుతూ అన్నదాన సత్రంలో పరిశుభ్రతలేదని, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్‌ లేదని తెలిపారు. ఇఒ స్పందిస్తూ లడ్డు విషయంలో పోటు సిబ్బందికి సూచిస్తామని, నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పారు. టీ దుకాణాల్లో మట్టిగ్లాసులు వినియోగించేలా అవగాహన కల్పిస్తామని, తిరుమలలో పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.శ్రీవారి సేవలో జాన్వీకపూర్‌శ్రీదేవి కుమార్తె, సినీ నటులు జాన్వీ కపూర్‌, మహేశ్వరి తిరుమల శ్రీవారిని గురువారం సందర్శించారు.

➡️