నేడు విశాఖలో నేవీ డే.. ఆర్కే బీచ్‌ లో ప్రదర్శనలు

Dec 10,2023 10:33 #Navy Day

ప్రజాశక్తి-విశాఖ : భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నేవీ డే జరుపుకుంటారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఏడాది మైచౌంగ్‌ తుపాను కారణంగా 4వ తేదీన జరగాల్సిన వేడుక 10వ తేదీకి వాయిదా పడింది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆర్కే బీచ్‌లో ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. నేవీ యుద్ధనౌకలు, ఫైటర్‌ జెట్‌లు, జలాంతర్గాములు, హెలికాప్టర్‌లతో సిబ్బంది విన్యాసాలు చేస్తారు. దాదాపు 2 వేల మంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ ఏడాది నేవీ డేకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

➡️