న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం

Apr 28,2024 21:24 #bro anilkumar, #speech

– వైఎస్‌.షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌
ప్రజాశక్తి-కడప :న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని వైఎస్‌ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. కడప రాజారెడ్డివీధి చర్చిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుడిపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌ తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటూ గతంలో మీడియా ఎదుట బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ వాపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య షర్మిలను కడప లోక్‌సభ అభ్యర్థిగా గెలుపించుకొనేందుకు బ్రదర్‌ అనీల్‌ రంగంలోకి దిగారని.. అందులో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.

➡️