– కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్
ప్రజాశక్తి – కురుపాం :విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి, అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సిపిఎం తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కోరారు. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణతో కిషోర్చంద్ర దేవ్ ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. సిపిఎం గెలుపుకు అన్ని విధాలా మద్దతిస్తానని తెలిపారు. దేశంలో లౌకిక ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన వామపక్షాలకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నానన్నారు. అరకు పార్లమెంట్, కురుపాం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు పాచిపెంట అప్పల నర్స, మండంగి రమణలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తమ మద్దతుదార్లకు విజ్ఞప్తి చేశారు.