ప్రజాశక్తి – నందిగామ
ఎన్టిఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామ సిపిఎం శాఖ కార్యదర్శి కటారపు విఠల్రావు సతీమణి కళావతి (48) వడదెబ్బతో ఆదివారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కళావతి గత రెండు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం రోజులుగా కాస్తున్న ఎండలకు తట్టుకోలేక మృతి చెందారు. మృతురాలికి భర్త విఠల్రావు, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కళావతి మృతదేహాన్ని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం, రాఘవాపురం సర్పంచ్ పెసరమల్లి సురేష్, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు.