టిడిపిలో చేరిన వైసిపి నాయకులు

Apr 18,2024 17:05

అమరావతి: భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మలతో పాటు దుక్క కృష్ణయాదవ్‌, వైసిపి జిల్లా ప్రధానకార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచ్‌లు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షుడు జి.సూర్యబాబు తెదేపాలో చేరారు. జీడీ నెల్లూరు నుంచి సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు బాబు నాయుడు, మాజీ సర్పంచి జయచంద్రనాయుడు చేరారు. వీరికి చంద్రబాబు టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️