జగన్ పై నారా లోకేష్
ప్రజాశక్తి-మంగళగిరి : అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావని జగన్ ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన ముఠా బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి, అత్యంత దారుణంగా హతమార్చిందని విమర్శించారు. కాపాడాల్సిన ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి హంతకులకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. బీసీల భూములు లాక్కొని, చంపేందుకేనా ‘నా బీసీలు.. నా బీసీలు.. అంటావ్’ అని జగన్ ని లోకేష్ ప్రశ్నించారు.
…