ఫ్రాన్స్ : ” తీవ్రంగా కడుపునొప్పి అంటూ … మహిళ ఆసుపత్రికి వెళ్లింది… స్కానింగ్ చేసి చూసిన డాక్టర్లు షాకయ్యారు..! ” ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే ….
ఫ్రాన్స్కి చెందిన 37 ఏళ్ల మహిళ 10 రోజులుగా తీవ్ర కడుపు నొప్పిని భరిస్తూ తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేసి చూశారు. ఆమె కడుపులో పిండం ప్రేగుల్లో పెరుగుతుండటాన్ని చూసి షాకయ్యారు. దీనిపై అవాక్కయిన డాక్టర్లు మాట్లాడుతూ … సాధారణంగా పిండం గర్భశయంలో పెరుగుతుందని, కొందరికి తాము ప్రెగెన్సీ అని తెలియని ఎన్నో మహిళల కేసులు చూశామని తెలిపారు. కానీ ఇలా పేగుల్లో బేషుగ్గా పిండం పెరగడం చూడటం ఇదే తొలిసారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ పిండం గర్భశయం ట్యూబ్లో గాక బయట ఎక్కడ పెరిగినా.. పిండవిచ్ఛత్తి అవ్వడం లేదా గర్భం నిలవకపోవడం వంటివి జరుగుతాయి కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా పిండం పేగుల్లో నిక్షేపంగా పెరుగుతుందని తెలిపారు.
‘ఉదర ఎక్టోపిక్ గర్భం’ అని పిలుస్తారు…
సరిగ్గా అప్పుడు ఆమె 23 వారాల గర్భవతి అని కూడా వైద్యులు నిర్థారించారు. ఇలా ప్రేగుల్లో పిండం పెరగడాన్ని ‘ఉదర ఎక్టోపిక్ గర్భం’ అని పిలుస్తారని వివరించారు. అయితే వ్యైదులు ఆ మహిళను తమ పర్యవేక్షణలో ఉంచుకుని 29 వారాల అనంతరం విజయవంతంగా ఆమెకు ప్రసవం చేశారు. 3 నెలల అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు తెలిపారు.
విజయవంతంగా ఆపరేషన్..
ఆరోగ్యంగా శిశువు…వైద్యులు మాట్లాడుతూ… ఇలాంటి ఎక్టోపిక్ గర్భాలు అంతర్గత రక్తస్రావం అయ్యి ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుందని, దీని వల్ల తల్లి, బిడ్డలిద్దరికి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు… ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని ఆమెను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి డెలివరీ చేశామన్నారు. ఇలాంటి కేసుల్లో దాదాపు 90 శాతం వరకు శిశువులను కోల్పోయే అవకాశాలే ఎక్కువుగా ఉంటాయని అన్నారు. ఒకవేళ శిశువు జీవించినా కూడా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ ఈ మహిళ విషయంలో అలాంటివి జరగనివ్వకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న శిశువును బయటకు తీయగలిగామని డాక్టర్లు హర్షాన్ని వ్యక్తం చేశారు.