ఇంటర్నెట్డెస్క్ : ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్కుమార్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తాను ప్రేమించిన నికోలరు సచ్దేవ్తో ఏడడుగులు వేయనుంది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే వీరి నిశ్చితార్ధం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. నికోలరు ముంబైకి చెందిన ఓ బిజెనెస్మ్యాన్ అని తెలుస్తోంది. వీరి ప్రేమ గురించి వరలక్ష్మీ ఎక్కడా లీక్ కాకుండా ఇన్నాళ్లు ఎంతో జాగ్రత్తలు తీసుకుంది. అయితే సినీ ఇండిస్టీకి చెందిన వ్యక్తి కాకుండా.. ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకోనున్నట్లు చెప్పి అందరినీ షాక్కి గురిచేసింది.