హైదరాబాద్ : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. సోమవారం సాయంత్రం 4.00 గంటల సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. మియాపూర్, చందానగర్ సహా పలుచోట్ల వర్షం పడినట్లు అధికారులు తెలిపారు.