ప్రజాశక్తి-గంపలగూడెం: జరగనున్న ఎన్నికల నేపథ్యంలో సదరు నియమావళిని అనుసరిస్తూ, గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన రంగులు, ప్రైవేట్ వ్యక్తుల విగ్రహాలను మూసేసి కార్యక్రమంలో అధికారులు నిమగ్నమైనారు. స్థానిక ఎంపీడీవో పీవీఎస్ నాగేశ్వరరావు ఆదేశాలు మేర సచివాలయాల సిబ్బందితో అధికారులు వైసిపి, టిడిపి, జనసేన, బిఎస్పి తదితరుల పార్టీలకు చెందిన ప్రచార బ్యానర్లు, రంగులను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు.