మే 4 దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా ఏటా నాలుగోతేదీన డైరెక్టర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో జరిగే కార్యక్రమానికి ఇప్పటికే చిరంజీవితోపాటు మరికొంతమంది హీరోలకు ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ని కూడా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి ఆహ్వనించారు. వస్తానని మాట ఇవ్వడంతో పాటు సెలబ్రేషన్స్ బాగా జరిపించాలని రూ.35 లక్షల విరాళం కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ వెల్లడించారు.