మాట్లాడుతున్న నాయకులు
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలి
ప్రజాశక్తి-కావలి:కావలి నలంద హై స్కూల్లో ప్రయివేటు పాఠశాలల సమావేశం గురువారం మధ్యాహ్నం 03:30 గంటలకు కావలి గాయత్రీనగర్ నలంద హై స్కూలులో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధు లుగా రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థు లకు ”కీర్తి శేషులు మనోహర్ రెడ్డి టాలెంట్,సెర్చ్ఎగ్సామినేషన్ ”నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్ష జనవరి 10వ తేదీన పాఠశాల స్థాయిలోనూ జనవరి 30వ తారీఖున నియోజకవర్గ స్థాయిలోనూ,ఫిబ్రవరి 4వ తారీఖున జిల్లాస్థాయిలోనూ ఎగ్జామును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
![మాట్లాడుతున్న నాయకులు](https://prajasakti.com/wp-content/uploads/2023/12/43-kavali.jpg)