కూరగాయల ధరలు అదుపులో ఉంచాలని నిరసన

Jun 30,2024 00:52 #Vegetables rates nirasana cpi
Vegetable Rates nirasana

 ప్రజాశక్తి-పెందుర్తి : సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కాయగూరల ధరలు అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్‌ మహిళ సమాఖ్య ఏరియా సమితి ఆధ్వర్యాన పెందుర్తి రైతు బజార్‌ వద్ద శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఆర్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ, రైతులను దోచుకుంటున్న దళారీ వ్యవస్థను కట్టడిచేయాలని కోరారు. మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎమ్‌ఎ బేగం మాట్లడుతూ, నిత్యవసర వస్తువుల ధరలను కూడా తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి నాయకులు వై.రాంబాబు, జయ, స్థానిక శాఖ కార్యదర్శులు ఎన్‌.అసిరినాయుడు, అన్నపూర్ణ, పార్టీ సభ్యులు కె.రజినీ, రమణ, రామారావు పాల్గొన్నారు.

➡️