బీజింగ్ : చైనాలో హెనాన్ ప్రావిన్స్లోని పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా 13 మంది మృతి చెందినట్టు గ్లోబల్టైమ్స్ దినపత్రిక వెల్లడించింది. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని నాన్యాంగ్లోని యన్షాన్పు గ్రామంలోని ఇంగ్కారు పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరగడం వల్ల పోలీసులు పాఠశాల నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారని గ్లోబల్ టైమ్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారణను కొనసాగిస్తున్నారు. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.