ప్రజాశక్తి-కొండపి : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సైన్సుడే సందర్భంగా ఘనంగా సన్మా నించారు. స్థానిక ఎంఆర్సి భవనంలో ప్రధానో పాధ్యాయులలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒలు సురేఖ, రామారావు ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.అరుణ, మిట్టపాలెం హెచ్పి పాఠశాల ప్రధానో పాధ్యాయుడు యం.వీరయ్య, ముప్పవరం జడ్పి హెచ్ స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు జి.శివశంకర్, పెట్లూరు ఆదిఆంధ్ర పాఠశాల ప్రధానో పాధ్యాయుడు సిహెచ్.చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్ కె.హనుమంతర ావును సన్మానించారు. ఈ కార్యక్ర మంలో వివిధ పాఠశాలల ప్రధానో పాద్యాయులు, పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/28kdp1-1.jpg)