న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందారు మోటార్ ఇండియా కొత్తగా ‘గ్రామీణ్ మహోత్సవ్’ క్యాంపెయిన్ను ప్రారంభించినట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గ్రామీణ మహోత్సవ్లో భాగంగా 16 ప్రదేశాల్లో తమ ఉత్పత్తి ప్రదర్శనలు, నుక్కడ్ నాటకం, లైవ్ మ్యూజిక్, జానపద నృత్యం, ప్రాంతీయ ప్రతిభా ప్రదర్శనలను చేపట్టనున్నట్లు ఆ కంపెనీ సిఒఒ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. గతేడాది తాము గ్రామీణ ప్రాంతాల్లో 1.15 లక్షల యూనిట్ల అమ్మకాలు చేశామన్నారు.