- 10% మంది ఉద్యోగులకు ఎసరు..!
బెంగళూరు : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్లో బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేశారు. మరోవైపు సంస్థలో పని చేస్తున్న వారిలో 200 మంది ఉద్యోగుల్ని లేదా 10 శాతం మందిని తొలగించే ప్రక్రియ జరుగుతుందని సమాచారం. సంస్థ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు వెళ్తున్నందున పొదపు చర్యలకు పాల్పడుతోంది. ఇపిఒ కోసం మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.