అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Nov 24,2023 18:44
మాట్లాడుతున్న ఎంపి ఆదాల

మాట్లాడుతున్న ఎంపి ఆదాలఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం లోని 26వ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్లో 83 లక్షల రూపాయల నిధులతో శుక్రవారం నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, రూరల్‌ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పలు అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డివిజన్లోని జ్యోతి నగర్‌లో పలు రూ.83 లక్షలతో అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్లోని వేదాయపాలెంలోని జ్యోతి నగర్‌ 5వ వీధిలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, రూరల్‌ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి నెల్లూరు నగర మేయర్‌ పోట్లూరు స్రవంతి జయవర్ధన్‌, 26వ డివిజన్‌ ఇన్‌ఛార్జిలు మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్‌, బాబు, 27వ డివిజన్‌ ్జ సన్నపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, క్లస్టర్‌ అధ్యక్షులు టీవీఎస్‌ కమల్‌ తదితరులతో కలిసి పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అభివద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

➡️