- దీక్షా శిబిరంలో భిన్న మతాల ప్రార్థన
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నిరవధిక సమ్మెలో భాగంగా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు పిల్లాపాపలతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. చిడతలు వాయిస్తూ భజన చేశారు. దీక్షా శిబిరంలో భిన్న మతాల ప్రార్ధనలు నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించమని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా సిపిఎం ఒకటో పట్టణ కార్యదర్శి రామిరెడ్డి , వెంకటనారాయణ మాట్లాడుతూ.. మునిసిపల్ కార్మికులు పారిశుద్ధ్యం స్ట్రీట్ లైటింగ్ వాటర్ సెక్షన్ పార్కు స్వీపర్లు ఇతరత్రా కార్మికులందరూ ప్రజల కోసం కష్టపడుతూ పని చేస్తుంటే.. ఈ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతూ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా పోటీ కార్మికులతో పనిచేస్తున్నారని అన్నారు. పోటీ కార్మికులను అడ్డుకుంటూ మున్సిపల్ కార్మికులు సమ్మెను కూడా కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేసి వారి సమ్మె విరమింప చేసే విధంగా చర్చలు జరపాలని లేనిపక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నల్లప్ప ఓబుళపతి మురళి పోతులయ్య లక్ష్మి నగర అధ్యక్ష కార్యదర్శులు, బండారి ఎర్రి స్వామి సాకే తిరుమలేశు మహిళా కన్వీనర్లు లక్ష్మీ నరసమ్మ మంత్రి వరలక్ష్మి క్లాప్ ఆటో డ్రైవర్లు పేదయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.