స్వయంగా వెళ్లి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్ సి.రవిచంద్ర రెడ్డి
నరసరావుపేట: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా నరస రావుపేట మున్సిపాలిటీలో పన్నులు వసూలు చేయడంలో మున్సిపల్ కమిషనర్ సి. రవిచంద్ర రెడ్డి చొరవ చూపి స్తున్నారు.పెద్ద మొత్తంలో పన్ను బకాయి ఉన్నవారి వద్దకు స్వయంగా తానే వెళ్లి వసూలు పన్నులు చేయడం జరుగు తుంది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా బకాయి ఉన్న వారి వద్ద రూ.3.5 లక్షల పన్ను కట్టించి వారికి రశీదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మిగతావారు కూడా ఈ ఆర్థిక సంవత్స రానికి పన్ను బకాయి ఉన్న వారందరూ ప్రభుత్వం వారు కల్పించిన వడ్డీ రాయితీ తో పన్ను చెల్లించి పురపాలక సంఘం వారికి సహకరించాల్సిందిగా ప్రజలను కోరారు. అదేవిధంగా ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ప్రజలు త్వరగా వచ్చి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు వద్ద లేదా మొబైల్ కౌంటర్ల వద్ద పన్ను చెల్లించి తగు రశీదు పొందాలని, 31వ తేదీ ఆదివారం అయినప్పటికీ కూడా పుర పాలక సంఘం,మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.