పొర్లుదండాలతో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : 9వ రోజు సమ్మెలో భాగంగా బుధవారం పారిశుధ్య కార్మికులు పురపాలక కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ ఓబయ్య, నాయకురాలు లక్ష్మీదేవి, ప్రసాద్‌, రమణ, రెడ్డయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️